🔅 ఆంజనేయుడు పెరిగి పెద్ద వాడవుతున్నాడు.ఒక రోజు ఆకలి గా వుందని అమ్మను అడిగాడు ఏమైనా పెట్టమని.
ఆమె పండిన పళ్ళు చెట్టుకు వుంటాయి కోసుకొని తినమన్నది.
అప్పుడే సూర్యోదయం అవుతోంది అరుణ కాంతితో సుర్యుడు ఉ౦డటం వల్ల పండు గా భావించి ఆకాశానికి యెగిరి సూర్యున్నిపట్టు కొన్నాడు.
🔅 ఆరోజు సూర్య గ్రహణం రాహువు సూర్యుని కబళి౦చాలి.తాను చేయాల్సిన పని ఇతను చేయటం చూసి కోపం వచ్చింది.
నేరేడు పండు లాగా నల్ల గా వున్న రాహువుని చూసి పండు అనుకోని పట్టుకో బోయాడు.
అతను పారిపోయి ఇంద్రుడికి చెప్పాడు.
🔅 తెల్లని ఐరావతం ఎక్కి ఆయన వచ్చాడు.
దాన్ని కబళించాలని మీదకు దూకాడు.
ఇంద్రునికి, ఆశ్చర్యము,కోపమూ వచ్చి వజ్రాయుధాన్ని ముందుగా తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.
నోటిలో సూర్య బింబాన్ని వుంచుకొనే ఆంజనేయుడు ఆ రెండిటినీ రెండు వెంట్రుకలతో ఎదుర్కొని వాటిని పనికి రాకుండా చేశాడు.
🔅 దేవతలంతా వచ్చి సూర్యుడు లేక పొతే ప్రపంచానికి చాల నష్టమని,యజ్ఞాది క్రతువులు చేయటం కుదరదని అతనికి నచ్చ చెప్పారు.
వాళ్ల మాట విని తాను నోటితో మింగిన సూర్యున్ని వదిలేశాడు.
ఇంద్రునికి కలిగిన పరాభవం మర్చి పోలేక,ఆన్జనేయుడు ఏమరు పాటులో వుండగా మళ్ళీ వజ్రాయుధం విసిరాడు.
🔅 అది అతని దవుడ కు తగిలి నెత్తురు గడ్డ కట్టి స్పృహ కోల్పోయాడు.వాయువుకు ఈ విషయం తెలిసి వీచటం మానేశాడు.
ప్రపంచం గాలి లేక స్తంభించి పోయింది.
మళ్ళీ దేవతలందరూ వచ్చారు బ్రహ్మ తన కమండలం లోని నీళ్ళను బాలుని పై చల్లి మూర్చనుంచి మరల్చాడు.
🔅 దేవతలందరినీ అన్జనేయునికి వరాలు ఇవ్వమని బ్రహ్మ ఆదేశించాడు.
దీర్ఘాయువు,
బలం,
పరాక్రమం,
ఆరోగ్యం,
తేజస్సు,
గుణం,
బుద్ధి,
విద్య,
విచక్షణ,
ప్రసన్నత,
చతురత,
వైరాగ్యం,
విష్ణు భక్తి,
దయ,
పర స్త్రీ విముఖత,
ఏ అస్త్రము ఏమీ చేయలేని శక్తిని దేవతలందరూ ఆన్జనేయునికి వరం గా అనుగ్రహించారు.
🔅 వజ్రాయుధం చేత మరణం ఉండదని,బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయలేదని అయితె దానికి కొద్ది సేపు లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.
🔅 వజ్రాయుధం తగిలినా ఊడి పోకుండా అతని దవడ ఆంటే హనుమ వుంది కనుక అప్పటినుంచి అంజనేయుడికి హనుమ అనే పేరు సార్ధకం అవుతుందని చెప్పారు.
🔅 విష్ణు మూర్తి లాగ దేవతలను వుద్దరిస్తాడని,
రామ కార్యం నేరవేరుస్తాడని,
శివునిలా దుష్ట సంహారం చేస్తాడని,
లంక లోని రాక్షసులను వదిస్తాడని,
త్రిమూర్తుల అవతారం కనుక త్రిమూర్త్యాత్మకుడనే పేరుతో పిలువబడతాడని,
దుష్ట గ్రహాలను పారదోల టానికి ప్రతి గ్రామం లో ఆంజనేయ దేవాలయాలు నెలకొల్పుతారని బ్రహ్మ అనుగ్రహించి అంతర్ధానమయాడు.
🔅 వాయువు మళ్ళీ వీచి సకల ప్రాణి కోటికి ప్రాణ వాయువును అందించాడు.
ఇలా ఆంజనేయుడు హనుమగా మారాడు.
0 Comments
Hello buddy if you have any doubts feel free to comment