AP SSC Results 2023: ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
AP SSC Results 2023: ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫలితాలను విద్యార్ధులు అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. దీంతోపాటు టీవీ9 వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగిన విషయం తెలిసిందే. 18 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈఏపీ) ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది పరీక్షలకు హాజరయ్యారు. హాజరైన వారిలో బాలురు 3,09,245, బాలికలు 2,95,807 మంది ఉన్నారు. విజయవాడలోని ఎస్ఎస్సీ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ఫలితాలను విడుదల చేసి.. ఉత్తీర్ణులయిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
ఈ ఏడాది కూడా బాలికలు.. బాలురపై పై చేయి సాధించారు. అత్యధిక శాతం మంది స్టూడెంట్స్ ఉత్తీర్ణులయ్యారు. 87.4 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం జిల్లా పథమ స్థానంలో నిలవగా.. నంద్యాల చివరిస్థానంలో ఉందిన. జూన్ 2 నుంచి 10 వరకు సప్లీమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
LINK 1 : https://www.bse.ap.gov.in/Resultsaprthrw
Link 2 :
◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.
0 Comments
Hello buddy if you have any doubts feel free to comment