Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. దసరాశరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు రాత్రి సర్వభూపాలవాహనంపై మలయప్పస్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. బకాసురున్ని వధిస్తున్నట్లు సర్వభూపాల వాహనంలో సాక్షాత్కరించారు. లోకసంచార సంకేతంగా తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. సర్వభూపాల వాహనసేవ వైభవాన్ని సంతరించుకుంది.
0 Comments
Hello buddy if you have any doubts feel free to comment