Header Ads Widget

చరిత్రలో ఈరోజు... సెప్టెంబర్ 24 న ఏం జరిగింది?

 

చరిత్రలో ఈరోజు

చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 24 |నేటి చరిత్ర|ముఖ్యమైన సంఘటనలు|ఎన్నో ఆసక్తికర అంశాలు|ముఖ్య సమాచారాలు 2022 :

సంఘటనలు :

1932: భారత్లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య పూనా ఒప్పందం కుదిరింది.

2007: మొట్టమొదటి ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్ ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ పై విజయం సాధించింది.


జననాలు :

1921: ధూళిపాళ సీతారామశాస్త్రి, ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. (మ.2007)

1923: కొరటాల సత్యనారాయణ, ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు. (మ.2006)

1931: మోతే వేదకుమారి, భారత పార్లమెంటు సభ్యురాలు, గాయని. ఆకాశవాణి గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి.

1940: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (మ.1994)

1945: డా. తిరునగరి రామానుజయ్య, సాహితీవేత్త, పద్యకవి. (మ. 2021)

1950: మోహిందర్ అమర్‌నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

1961: కుడుముల పద్మశ్రీ, నెల్లూరు లోకసభ సభ్యుడు.

1966: అతుల్ బెదాడే, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1972: శ్రీను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు.


మరణాలు :

1975: చక్రపాణి, బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు. (జ.1908)

2004: రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (జ.1929)

2010: సింహాద్రి సత్యనారాయణ, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. (జ.1929)

2012: అశ్వని, తెలుగు, తమిళ సినిమా నటి.

పండుగలు , జాతీయ దినాలు :

ప్రపంచ హృదయ దినోత్సవం.

ప్రపంచ నదుల దినోత్సవం.

ఎన్.ఎస్.ఎస్ దినోత్సవం.



Post a Comment

0 Comments