Header Ads Widget

చరిత్రలో ఈరోజు... సెప్టెంబర్ 17 న ఏం జరిగింది?

 

చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 17,charitralo eroju
చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 17 |నేటి చరిత్ర|ముఖ్యమైన సంఘటనలు|ఎన్నో ఆసక్తికర అంశాలు|ముఖ్య సమాచారాలు 2022 :

సంఘటనలు :

1948: హైదరాబాదు సంస్థానం నిజాం పరిపాలన నుండి విముక్తి పొంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది.

1978: ఇజ్రాయిల్-ఈజిప్టు దేశాల మధ్య కాంప్‌డేవిడ్ శాంతి ఒప్పందం కుదిరింది.

2008: థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్‌సవత్ ఎన్నికైనాడు.

జననాలు :

1879: పెరియార్ రామస్వామి నాయకర్ ఉద్యమకారుడు, రాజకీయనాయకుడు, సంఘసంస్కర్త, నాస్తికవాది.

1906: వావిలాల గోపాలకృష్ణయ్య, గాంధేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ సభ్యుడు. (మ.2003)

1915: ఎమ్.ఎఫ్. హుస్సేన్, భారతీయ చిత్రకారుడు. (మ.2011)

1943: తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త

1950: భారతదేశ 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడి జన్మించారు.

1990 బండారు శివప్రసాద్ జర్నలిస్ట్, అధ్యాపకుడు, తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు.

మరణాలు :

1922: ముత్తరాజు సుబ్బారావు, శ్రీకృష్ణ తులాభారం నాటక రచన ద్వారా ప్రసిద్ధులయ్యారు, ఇతర రచనలు ఉత్తర రామచరిత్ర, రాజ్యశ్రీ, చంద్రగుప్త. వీటిలో రాజ్యశ్రీ నాటకాన్ని చెన్నపురిలోని సుగుణవిలాస సభవారు ఏర్పరచిన పోటీలకు రాసింది (జ.1888).

పండుగలు , జాతీయ దినాలు :

తెలంగాణ విమోచన దినోత్సవం :

నిజాం కబంధ హస్తాల నుండి హైదరాబాదు సంస్థానం విముక్తి పొందిన రోజును తెలంగాణ విమోచన లేదా విలీన దినంగా పాటిస్తారు.

విశ్వకర్మ జయంతి :

విశ్వకర్మ జయంతి అనేది హిందూ దేవుడు, దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున నిర్వహించే పండుగ. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న విశ్వకర్మ పూజను నిర్వహిస్తారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా, ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడు. కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారక నగరాన్ని, పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతోపాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారుచేశాడు. దివ్య వడ్రంగి అని కూడా పిలువబడ్డాడు. మెకానిక్స్, ఆర్కిటెక్చర్ లలో శాస్త్రమైన స్థపత్య వేదంతో ఘనత పొందాడని ఋగ్వేదంలో ప్రస్తావించబడ్డాడు.

మహిళల మైత్రీ దినోత్సవం


Post a Comment

0 Comments