Header Ads Widget

ఏపీలో ఎంసెట్ రాస్తున్న విద్యార్థులకు అలర్ట్‌.. ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ తొలగించింది. ప్రతీ ఏటా ఇంటర్ మార్కులు ఆధారంగా ఎంసెట్‌లో 25శాతం వెయిటేజ్ ఇస్తున్న ఉన్నత విద్యామండలి.. కోవిడ్ కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఈ ఏడాది వెయిటేజ్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వంద శాతం ఎంసెట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే.. అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఇక.. ఏపీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (EAPCET)- 2021 ను ఆగస్టు 19 నుంచి ఆగస్టు 25 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.



*******************************************

*జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీ ఖరారు
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 పరీక్ష తేదీ ఖరారైంది. ఈ పరీక్షను అక్టోబర్ 3న నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా పరీక్ష తేదీని ప్రకటించారు.
ఈ పరీక్ష నిర్వహణలో పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఖరగ్‌పూర్ ఐఐటీ నిర్వహించనుంది. వాస్తవానికి జులై 3న ఈ పరీక్ష జరగాల్సి ఉంది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం పరీక్షను వాయిదా వేసింది. మూడు నెలల తరువాత ఈ పరీక్షను నిర్వహించబోతోంది. ఇక ఇప్పటికే జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలు కూడా మారాయి. ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు పూర్తి వివరాలను https://jeeadv.ac.in/ వెబ్సైట్ లో చూడవచ్చు.


Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇


Post a Comment

0 Comments